09-02-2026 12:00:00 AM
కోదాడ, ఫిబ్రవరి 8 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైవిఆర్ యువసేన కృషి చేస్తుందని వ్యవస్థాపకులు ఎలుగూరు కిరణ్ తెలిపారు. ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు 50 వేల రూపాయల విలువగల 100 క్రీడా టీ షర్టులు వైవిఆర్ యువసేన పంపిణీ చేసింది. క్రీడలను ప్రోత్సహించడమే కాక, గ్రామంలో సామాజిక కార్యక్రమాలు కూడా చేపడతామని, క్రీడాకారులు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కిరణ్ సూచించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, ఉపాధ్యా యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.