calender_icon.png 26 June, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎంఎంఎస్ ఫలితాలలో జడ్పీహెచ్‌ఎస్ ప్రతిభ

26-06-2025 12:02:12 AM

దేవరకొండ, జూన్ 25: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 2024-25 సంవత్సర ఎన్.ఎం.ఎం.ఎస్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు  ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను కొండమల్లేపల్లి మండల విద్యాశాఖ అధికారి రామావత్ నాగేశ్వరరావు నాయక్  అభినందించారు.

స్కాలర్షిప్ ఎంపికకు విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను వారు అభినందించారు.ఎంపిక అయిన విద్యార్థులకు సంవత్సరానికి 12 వేలా రుపాయల చొప్పున నాలుగు  సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందజేస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, జాను నాయక్, సైదా నాయక్, బాలాజీ నాయక్ సువర్ణ అనురాధ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు