calender_icon.png 26 June, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 9 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

26-06-2025 01:13:52 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 25(విజయ క్రాంతి): ఇందిరమ్మ గృహ నిర్మాణాల ప్రక్రియ వేగం పెంచి సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసుకోవాలని, ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిజాంపేట మండల నందిగామ గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి మండలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల తీరు, అంగన్వాడి సెంటర్స్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారి సొంతింటి కల నెరవేర్చాలని ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిందని ప్రోసిడింగ్ పొందిన లబ్ధిదారులు వేగంగా ఇండ్లు కట్టుకోవాలన్నారు.  దశలవారీగా బిల్లులు ఎకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 2500 ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు.  మిగిలిన లబ్ధిదారులు త్వరగా ముందుకు వచ్చి ఇండ్లు నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించిందని తెలిపారు.  మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో గుడిసెలలో నివాసముంటున్న  అత్యంత నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ పథకం వర్తింపజేశామన్నారు. చిన్నపిల్లలకు, బాలింతలకు మెనూలో కోడిగుడ్డు అందిస్తున్నారా లేదా అనే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తహసిల్దార్ రెవెన్యూ సిబ్బంది  పాల్గొన్నారు.