calender_icon.png 26 June, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 1న విచారణకు రండి

26-06-2025 01:15:06 AM

ఫార్ములా -ఈ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు

హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 25 (విజయక్రాంతి): ఫార్ములా -ఈ రేస్ కేసులో జూలై 1న విచారణకు హాజరు కావాలని ఈ కేసులో ఏh2 నిందితుడిగా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు బుధవారం ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

జూలై 1న విచారణకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశిం చింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అరవింద్‌కుమార్ ఈ నెలాఖరు వరకు తెలంగాణకు తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో గత జనవరిలోనే ఏసీబీ, ఆ తర్వాత ఈడీ అరవింద్‌కుమార్‌ను విచారించాయి. ఐదు నెలల తర్వాత జూన్ 16న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ మరోసారి విచారించింది. ఇప్పుడు అరవింద్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చింది.

కేటీఆర్, అరవింద్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు

గతంలో అరవింద్‌కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే గత వారం కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్లు, స్పాన్సర్లు, ఆర్థిక శాఖ అనుమతులు వంటి వివిధ అంశాలపై కేటీఆర్ నుంచి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబ ట్టారు. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన సమాధానాల ఆధారంగా అరవింద్‌కుమార్ ను ఏసీబీ ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కేటీఆర్, అరవిం ద్‌కుమార్‌ను ఉమ్మడిగా విచారించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజా నోటీసులతో ఫార్ములా -ఈవొ కేసు లో ఏం జరగబోతుందనేది ఆసక్తి రేపుతోంది. ఫార్ములా -ఈ రేస్ నిర్వ హణ, ఒప్పందాలన్నీ కేటీఆర్ స్వయం గా చూశారని అరవింద్‌కుమార్ గతం లో వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈసారి దర్యాప్తులో ఆయన చెప్పబోయే విషయాల ఆధారంగా కేటీఆర్ అరెస్టు ఉండబోతుందా అనే చర్చ నడుస్తున్నది.