calender_icon.png 26 June, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు

26-06-2025 01:13:24 AM

రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి 

కామారెడ్డి, జూన్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కొంతమంది పేటియం బ్యాచ్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బిచ్కుంద పిట్లంలో సెంట్రల్ లైటింగ్ గురించి మాట్లాడే పర్వత బిజెపి నాయకులకు లేదన్నారు. కేంద్రంలో 12 సంవత్సరాల అధికారంలో ఉండి జుక్కల్ నియోజకవర్గంకు ఏం చేశారో ముందు జుక్కల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గెలిచిన వెంటనే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్చుకోలేని బిజెపి నాయకులు రోడ్డుపైకి వచ్చి అది లేదు ఇది లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

ఇప్పటికైనా గుర్తించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గెలిచిన తర్వాతనే జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆ వ గహన అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం బిజెపి నాయకులు మానుకోవాలని సూచించారు. అభివృద్ధి విషయంలో పోటీపడాలి కానీ అనవసర రాద్దాంతం చేయడం తగదన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉందని జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారు చెప్పాలని బిజెపి నాయకులను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ  సర్పంచ్ లు జీవన్, నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, బిచ్కుంద మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు విట్టల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రిజ్వాన్, యువరాజు సింగ్, గంగాధర్, రాములు, సాయిలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.