కేజీబీవీలో వంద శాతం ఉత్తీర్ణత
30-04-2026 12:45 AM
వెల్దుర్తి, ఏప్రిల్ 29 : బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న 44 మంది విద్యార్థినిలు పరీక్షకు హాజరుకాగా 44 మంది విద్యార్థినిలు ఉత్తీర్ణులైనరని ఎస్ఓ ఫాతిమా తెలిపారు. వీరిలో ముగ్గురు విద్యార్థినిలకు 529,519, 518, మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీలకు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి ప్రత్యేక అభినందనలు తెలిపారు.






