పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారం
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభను చాటిన విద్యార్థులకు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నగదు పురస్కారాన్ని అందించి సత్కరించారు. శుక్రవారం పట్టణంలోని గజిటెడ్ నంబర్ 2 పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు సంఘం ప్రతినిధు లు నగదును అందజేసి అభినందించారు.
పది పరీక్షల్లో 566 మార్కులు సాధించిన విద్యార్థి విగ్నేష్, చేతన్, శిరిన్ లను సత్కరించి నగదు బహుమతిని అందించారు. అలాగే పరీక్షల సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవతరగతి విద్యార్థులకు వెన్నులను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లోనూ రాణించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి వేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.






