07-12-2025 12:00:00 AM
మంద జనార్దన్, సిద్దిపేట; అడవిలో సహజ వాతావరణంలో రాతిపై వేసిన ఈ పక్షి బొమ్మ అద్భుతంగా ఉంది. పచ్చని అడవిలో పక్షి రూపాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దడం ప్రకృతితో కలిసిపోయినట్లుగా అనిపిస్తోంది. ఇది పర్యావరణం, ప్రకృతి అందాలపై మనలో ప్రేమను పెంచేలా ఉంది. రాతిపై గీసిన బొమ్మ అయినా కూడా జీవంతో నిండిన పక్షిలా కనిపించడం కళాకారుడి ప్రతిభకు నిదర్శనం. ఇది సిద్దిపేట జిల్లా చిన్నకోడుర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలాల శివసేన గల రోడ్డు పక్కన ఉన్న ఆటవిలో ఉంది. రోడ్డున వెళ్ళే వాళ్ళు ఈ చిత్ర చూసి ఆగి నిజమైన పక్షినా, గీసిన చిత్రమా అని ఆశ్చర్యపోతున్నారు.