25-06-2025 12:40:09 AM
మహబూబాబాద్, విజయ క్రాంతి: ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా పచ్చని చెట్లని చెప్పడం ఆనవాయితీ. అయితే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ వృక్షం పూర్తిగా అరుణ వర్ణంగా పూసింది. ఆకులు ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా ఎర్రటి పూలతో పుష్పగుచ్చంగా మారి చూపరులను ఆకర్షించింది.