calender_icon.png 25 June, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడం రష్మి వచ్చారు.. వెళ్లారు

25-06-2025 12:40:32 AM

బాధితులు లేకుండానే విచారణ

పొరపాటున కాలంచెల్లిన మందులు ఇచ్చారు తాత్కాలికంగా ఫార్మసీ మూసివేత

వారం తర్వాత రాఘవేంద్ర ఆసుపత్రి పై చర్యలు డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మి అన్నవరం

పెబ్బేరు జూన్ 24 : మండల కేంద్రంలోని రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మి అన్నవరం మంగళవారం సందర్శించారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఆసుపత్రి లో తనభార్య పల్లవికి కాలం చెల్లిన మందులను యాజమాన్యం అంటగట్టిందని గణేష్ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఇట్టి విషయం పై డాక్టర్ రఘు కూడా దాటవేత సమాధానం ఇచ్చారని బాధితుడు ఆందోళన చేశారు.

పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ఆలస్యంగా అయినా మంగళవారం డ్రగ్ ఇన్స్పెక్టర్ రష్మి అన్నవరం విచారణ నిర్వహించారు. ఫార్మా నిబంధనల ప్రకారం నడుచుకొందని, కాలంచెల్లిన మందులను ప్రత్యేక అట్టడబ్బాలో భద్రపరిచారని ఆమె కితాబిచ్చారు. ఉదయం పదిగంటలనుంచి అన్నీ పరిశీలించామని సిబ్బంది పొరపాటు వల్ల కాలంచెల్లిన మందులను బాధితురాలికి ఇచ్చారని, యాజమాన్యం పొరపాటు లేనట్టు ఆమె చెప్పుకొచ్చారు.

జరిగిన తప్పిదాన్ని దృష్టిలో ఉంచుకుని వారం రోజుల పాటు ఫార్మసీ లైసెన్స్ పై సస్పెన్షన్ విధిస్తున్నామని మౌఖికంగా ఆదేశించారు. ఉమ్మడి జిల్లా అధికారికి నివేదికను అందజేస్తామని ఆపై వారు చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా అసలు బాధితులు లేకుండా అధికారులు ఎలా విచారణ చేస్తారని. వారి విచారణ రకంగా పారదర్శకంగా ఉంటుందని స్థానికులు పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.