25-06-2025 12:38:37 AM
జమ్మికుంటు,జూన్24(విజయక్రాంతి):కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి ఇన్స్పెక్టర్ నిరంజన్ పూల మొక్కను అందించి కమీషనర్కు స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ను పర్యవేక్షించి, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి, కేటాయించబడిన రెయిన్జాకెట్ వంటి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధి లోని ముఖ్యమైన మరియు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను పోలీస్ కమీషనర్ ప్రారంభించారు. ఈ కెమెరాలన్నీ పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అను సంధానించబడి, 24 గంటలపాటు రికార్డు అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని చోట్ల సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతామని జమ్మికుంట ఇన్స్పెక్టర్ రామకృష్ణ వెల్లడించినట్లు కమీషనర్తెలిపారు.