16 March, 2026 | 1:32 AM

దర్జాగా మూడు ముక్కలాట!

16-03-2026 12:00 AM
  1. పోలీసుల దాడులు జరిగిన వెనకాడని నిర్వాహకులు..

అటవీ ప్రాంతాలు, లాడ్జిలు, రైస్ మిల్స్, ఫంక్షన్ హాల్ లే అడ్డాలు..

పేకాటలో  ప్రభుత్వ ఉద్యోగులు, బడా వ్యాపారవేత్తలు..

బిట్ కాయిన్ పేరిట జోరుగా కొనసాగుతున్న పేకాట..

పేకాటతో వీధిన పడుతున్న కుటుంబాలు..

నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకునేనా..?

బాన్సువాడ, మార్చి 15 (విజయ క్రాంతి): పేద, మధ్యతరగతి ప్రజలు తోపాటు బడ వ్యాపారులు, బడా నాయకులు పేకాట కు బానిసలు అవుతున్నారు. పేకాట ఆడితే డబ్బులు వస్తాయని యావ తప్ప చేతిలో ఉన్న డబ్బులు ఊడుతున్నాయన్న సోయి మాత్రం పేకాటరాయులకు కలగడం లేదు. మరోవైపు పోలీసులు పేకాట ఆడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న మారుమూల ప్రాంతాలతో పాటు పట్టణాల్లో సైతం పేకాట స్థావరాలను కొందరు కొనసాగిస్తూ పేకాటను జోరుగా కొనసాగిస్తున్నారు. పేకాట వ్యసనాలకు అలవాటు పడ్డ వారు మాత్రం పేకాటను విడడం లేదు.

ఆస్తులు గుల్ల అవుతున్న అప్పులు చేసి పేకాట ఆడుతున్నారు. ఒకవైపు జిల్లా పోలీస్ అధికారి రాజేష్ చంద్ర ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి పేకాట  అరి కట్టేందుకు చర్యలు తీసుకుంటున్న మరోవైపు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది పేకాట నిర్వాహకులకు సహకరిస్తుండడంతో గుట్టు చప్పుడు కాకుండా నిత్యం పేకాట కొనసాగిస్తున్నారు. లక్షల రూపాయలు పేకాటతో చేతులు మారుతున్నాయి.

కొందరు ఆస్తులను సైతం అమ్ము కుంటున్నారు. మరికొందరు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మంచి కుటుంబాలలో పేకాట చిచ్చు పెడుతుంది. దీంతో కుటుంబాల్లో మనస్పర్ధలు ఏర్పడి కోట్లాటలు జరుగుతున్నాయి. పేకాట కు బానిసలుగా మారిన వారు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా పేకాట ఆడడం మాత్రం మానుకోవడం లేదు.

జిల్లాలో పేకాట జోరు

కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ,బాన్సువాడ, నియోజకవర్గం పట్టణాలు గ్రామాల్లో సైతం పేకాట జోరుగా సాగుతుంది. బాన్సువాడ డివిజన్ లో దర్జాగా ముడుముక్కలాట  నిర్వాహన కొనసాగుతుంది. మూడు పువ్వులు ఆరు కాయలుగా అన్నట్లుగా పేకాట నిర్వాహకులు ప్రత్యేక సిబ్బంది ద్వారా పేకాటనిర్వాహన నిర్వహిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. పేకాట ఆడే వారిని స్వయంగా తమ వాహనాల్లో తీసుకువెళ్లి పేకాట నిర్వాణ జరిగే స్థలంలో అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ  ధనార్జనే ధ్యేయంగా నిర్వాహకులు పోటీ పడడం గమనార్హం.

అంతేకాదు పేకాట ఆడేవారికి భోజన సదుపాయం, మందు, చిందు వంటి అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ జోరుగా పేకాటను నిర్వహిస్తున్నారు. బాన్సువాడ డివిజన్లోని జుక్కల్, మద్నూర్, పెద్ద కోడప్గల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్ నగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, బీర్కూర్, నస్రుల్లాబాద్, కోటగిరి, వర్ని, మోస్ర, చందూర్, రుద్రూర్ మండలాల్లో ప్రతినిత్యం ఏదో ఒకచోట పేకాట నిర్వహణ జరుగుతూనే ఉంటుంది.

గతంలో రుద్రూర్ మండలంలో అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట నిర్వాహన జరిగి ప్రత్యేక పోలీస్ బృందాల దాడులు చేపట్టి పేకాటపై ఉక్కు పాదం మోపారు. ఇప్పటికీ తిరిగి ఎదెచ్చగానే పేకాట నిర్వాహన కొనసాగుతుంది. వర్ని మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువ పక్కనే అటవీ ప్రాంతంలో బిట్ కాయిన్స్ రూపంలో పేకాట నిర్వహణ జోరుగా సాగుతున్న ఆ వైపు పోలీసులు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు ఉన్నాయి. పేకాటతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని అలాంటి సంఘటనలు జరగకుండా పేకాటన నివారించాలని కొలువురు కోరుతున్నారు.

అదేవిధంగా బాన్సువాడ పట్టణంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పేకాట జోరుగానే సాగుతుందని చెప్పుకోవచ్చు గత కొన్ని నెలల క్రితం బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు పార్కు వద్ద ఓ గదిలో బడా వ్యాపారులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. గత కొన్ని నెలల క్రితం బాన్సువాడలో  బడా వ్యాపారస్తులు పేకటాడుతూ ప్రత్యేక పోలీస్ బృందానికి దొరికారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం మదన్ హిప్పర్గా, పెద్ద శక్కర్గ గ్రామాలలో మొత్తం 24 మంది పేకాట ఆడుతూ దొరికారు.వారి వద్ద నుండి 34 వేల నగదు, 19 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు పేకాట నిర్వాహకులు అడ్డాలను మార్చారు ప్రస్తుతం బాన్సువాడ డివిజన్ లో అటవీ ప్రాంతాలు ఫంక్షన్ హాలు లాడ్జిలు రైస్ మిల్లల్లో జోరుగా పేకాట ఆడుతున్న రనే సమాచారం. దీనిపై పోలీసులు ఉక్కు పాదం మోపాలని పేకాటడే కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

అటవీ ప్రాంతాలు లాడ్జిలు, రైస్ మిల్స్, ఫంక్షన్ హాల్స్ పేకాట అడ్డాలు

బాన్సువాడ డివిజన్ లో పేకాట నిర్వాహకులు అడ్డాలను మార్చారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలు పేకాట నిర్వాణపై ఉక్కు పాదం మోపడంతో నిర్వాహకులు అలర్ట్ అయినారు. ఇప్పుడు అటవీ ప్రాంతాలు లాడ్జిలు రైస్ మిల్స్ ఫంక్షన్ హాల్‌లోని గదుల్లోనే జోరుగా పేకాట  నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉంటే పేకాట ఆడే ఆటగాళ్లను అటవీ ప్రాంతంలో తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా వారిని తీసుకువెళ్లి అక్కడే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కేటి రూపంలో నిర్వాహకులు డబ్బులను వసూలు చేసి వారికి భోజనం మందు ఇతర సౌకర్యాలను కల్పిస్తూ పేకాటను జోరుగానే సాగిస్తున్నారు అంతేకాకుండా ముందుగానే పేకాట నిర్వాహకులు ఆటగాళ్లతో మాట్లాడి ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాలపై పేకాట ఆడే స్థలంలోకి తీసుకువెళ్లి నిర్వాణ కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి

అంతే కాకుండా పేకాట నిర్వాహకులు ధనార్దమే ధ్యేయంగా కొంతమంది పోలీస్ సిబ్బందికి ముడుపులు చెల్లిస్తూ ఈ నిర్వాహ కొనసాగిస్తున్నారని ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పోలీసులు ఇన్ని దాడులు చేపట్టిన పేకాట మాత్రం ఆగడం లేదు. నిర్వాహకులే పక్కా ప్రణాళికతో పేకాటన కొనసాగిస్తున్నారూ .బాన్సువాడ డివిజన్లో ఎక్కడ చూసినా అటవీ ప్రాంతాలనే అడ్డాలుగా మారుస్తున్నారు. ఇప్పటికైనా అటవీ ప్రాంతాల్లో రైస్ మిల్స్ లాడ్జిలు ఫంక్షన్ హాల్లో పూర్తిగా నిఘా పెడితే భారీగానే బడా వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు,బడా నాయకులు దొరకడం ఖాయమని పలువురు చర్చించుకోవడం విశేషం. 

పోలీసులు దాడులు చేసిన ఆగని పేకాట

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం గతంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట నిర్వాణపై దాడులు చేపట్టి వేల సంఖ్యలో నగదు వందల సంఖ్యలో ఆటగాళ్లను, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ పేకాట నిర్వాహకులు తమ అడ్డాలను మారుస్తూ ఎదెచ్చగానే పేకాట నిర్వహిస్తున్నారని  ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి అదేవిధంగా మరికొంతమంది  లోకల్ పోలీస్ సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని పేకాట నిర్వహణకు కొనసాగిస్తున్నారు అన్న  విమర్శలు ఉన్నాయి. పోలీసులు ఎన్ని దాడులు చేపట్టిన పేకాటనిర్వాకులు అడ్డాలు మారుస్తున్నారు.

తప్ప పేకాటను పూర్తిగా నిషేదించాడక పోవడం గమనహర్వం. పేకాట ఆడే వారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, బడా వ్యాపారవేత్తలు, ప్రతిరోజు పేకాట ఆడుతూ లక్షలు చేజేతులారా పోగొట్టుకుంటున్నట్లు సమా చారం. ఇప్పటికైనా పేకాట నిర్వాహకులపై ప్రత్యేక నిగా పెట్టి బాన్సువాడ డివిజన్‌లో పేకాటను పూర్తిస్థాయిలో నిషేధించే విధంగా పోలీసులు ప్రత్యేక బృందాలు చర్యలు తీసుకోవాలని పేకాట ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు

బాన్సువాడ డివిజన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి హెచ్చరిం చారు. పేకాట నిర్వాణపై డీఎస్పీని విజయక్రాంతి వివరణ కోరగా పోలీసులు ఎప్ప టికప్పుడు ప్రత్యేక బృందాల ద్వారా నిఘా పెట్టి పేకాట సామరాలపై దాడులు చేపడుతున్నామని ఆయన తెలిపా రు. ఎక్కడైనా పేకాట ఆడితే తమకు సమాచారం అందిం చాలని వారి పేర్లను గొప్పంగా ఉంచుతామని డీఎస్పీ విట్టల్ రెడ్డి తెలిపారు.

- విఠల్‌రెడ్డి, డీఎస్పీ బాన్సువాడ