9 April, 2026 | 11:03 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కాంగ్రెస్ విజయకేతనం ఖాయం

06-02-2026 12:48 AM

మొయినాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మొయినాబాద్  మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా  హిమాయత్ నగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థులు గొల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, కంజర్ల భాస్కర్ గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో అమలువుతున్న ఆరు గ్యారంటీ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పార్టీని గెలిపిస్తాయని నేతలు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల భారీ మెజారిటీకి కృషి చేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా రంజక పాలన చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో మాకే పట్టం కట్టబోతున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ కుమార్ యాదవ్, మండల అధ్యక్షుడు మాణ్యయ్య మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.