10-09-2024 12:49:48 AM
దిలీప్ ప్రకాశ్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్లో నటిస్తున్న తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హార్న్బిల్ పిక్చర్స్పై సురేశ్ పాటిల్ నిర్మిస్తున్నారు. ప్రకాశ్రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరో దిలీప్ ప్రకాశ్ విలేకరులతో పంచుకున్న సినిమా విశేషాలివీ.. “-స్కూల్స్ డేస్ నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది.
స్కూల్లో నాటకాలు రాయడం, ప్రదర్శించడం చేసేవాన్ని. ‘ఉత్సవం’ కథ చాలా రెస్పెక్టబుల్ సబ్జెక్ట్. చాలా గర్వంగా చెప్పుకునే సినిమా. ఇందులో కథనే హీరో. -రంగస్థల కళాకారుల మీద తీసిన సినిమా ఇది. సురభి నాటక సమాజం స్ఫూర్తి ఉంది. సినిమా వచ్చిందే నాటకాల నుంచి. మన రూట్స్ను గుర్తు చేసేలా ఉంటుంది. మంచి ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ కూడా ఉంటుంది” అన్నారు.