10-09-2024 12:52:03 AM
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. సుమన్కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబళే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుందీ చిత్రం. ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. “నమ్మిన దాని కోసం నిలబడే ఓ ధైర్యశాలి పాత్రను ‘రఘు తాత’ చిత్రంలో పోషించడం ఆనందంగా ఉంది. ఆ పాత్రకు జీవం పోయడం ఓ సవాలుగా అనిపించింది. ఆకర్షణీయమైన కథనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువవుతుండటం సంతోషంగా ఉంది” అని తెలిపింది.