30-10-2025 12:19:07 AM
వందకు పైగా గొర్రెలు మృతి తీవ్రంగా నష్టపోయిన గొర్రెల కాపరులు
నాగర్ కర్నూల్ అక్టోబర్ 29 (విజయక్రాంతి); నాగర్కర్నూల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. దుందుభీ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా తాదూరు మండలం ఇంద్రకల్, ఇతోల్, సిర్సవాడ, గోవిందాయపల్లి, తెలకపల్లి మండలం ఆలేరు గ్రామాల గొర్రెల మంద మేతకోసం వెళ్లి గోవిందాయ పల్లి గ్రామ శివారులో వాగు ఉదృతికి కొట్టుకుపోయాయి. తెలకపల్లి మండలం ఆలేరు గ్రామ సమీపంలో గొర్రెల మంద వరద నీటిలో కొట్టుకుపోయాయి. సుమారు ఐదు మంది గొర్రెల కాపరులకు చెందిన సుమా రు వందకు పైగా గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. గొర్రెల కాపరులు తీవ్రంగా నష్టపోయి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.