30-06-2025 07:53:50 PM
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి సింగరేణి సంస్థకు సేవలు అందించి పదవి విరమణ పొందిన అధికారులకు ఏరియా జిఎం దేవేందర్(Area GM Devender), ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు. జిఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమంలో పదవి విరమణ పొందిన ఇంజనీర్ ఈ అండ్ ఎం వెంకట రమణ, జిఎం పిఏ ప్రసాద్, జిఎం ఆఫీస్ జూనియర్ ఆఫీసర్ బుచ్చయ్యలను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ... సుదీర్ఘకాలంగా సింగరేణికి సేవలు అందించిన అధికారులు పదవీ విరమణ పొందడం బాధాకరమైనప్పటికీ ప్రతి అధికారికి పదవి విరమణ తప్పదన్నారు.
పదవి విరమణ పొందిన అధికారులు ఏరియాలో విశేష సేవలు అందించి సహా అధికారుల, కార్మికుల ఆదరాభిమానాలు చూరగొన్నారని వారి సేవలను ఆయన కొనియాడారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, జిఎం కార్యాలయ పిట్ సెక్రటరీ గీతిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.