02-06-2025 12:50:00 AM
శాలిగౌరారం, జూన్ 1: అడ్లూరు లోని జెడ్ పి ఎచ్ ఎస్ హైస్కూల్ 2008-09 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం స్థానిక అడ్లూర్ హై స్కూల్ ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ను 16 సంవత్సరాల తరువాత ఘనంగా ఎంతో ఉత్సాహంగా గురువులను ఆహ్వానించి అపూర్వంగా ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడి చాలా రోజుల తరువాత వారు కలుసుకోవడం తో వారి ఆనందానికి అవధులు లేవు..
ఒకరనినొకరు ఆప్యాయతగా పలకరించుకొని చిన్న నాటి మనోభావాలను,జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళన సమావేశం అనంతరం తమకు పాఠాలు బోధించిన గురువులను ఘనంగా శాలువాల తో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిమ్మనగోటి మత్స్యగిరి, శీలం నరేష్, నల్లగొండ యశ్వంత్, పి.మహేష్, డి.ఈశ్వర్, ఎన్.హరికృష్ణ, ఎస్.జానీ, డాక్టర్ సతీష్, శేఖర్, జె. మహేష్, కే.జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.