2 July, 2026 | 3:02 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

26-03-2025 12:46 AM

భోలక్‌పూర్‌లో పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 25: (విజయక్రాంతి): భోలక్‌పూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వేద పండితుల సమక్షంలో వేంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆలయ కమిటీ నేతలు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యానాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్య లో తరలిరావడంతో పరిసర ప్రాంతాలు  భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సీనియర్ నాయకులు బింగి నవీన్ కుమార్, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సీతా మార్కండేయ, పుండరీకం, కోశాధికారి గడ్డం నవీన్ కుమార్, సలహాదారులు ఆర్. ఆంజనేయులు, కృష్ణమూర్తి, కార్యనిర్వహక కార్యదర్శి ఎ. వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..