02-07-2025 05:20:04 PM
మందమర్రి (విజయక్రాంతి): పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్న ఈజిఎస్ ఎపిఓ రజియా సుల్తానాను ఎంపీడీవో రాజేశ్వర్(MPDO Rajeshwar), ఇతర అధికారులు ఘనంగా సన్మానించారు. ఏసియా ఇంటర్నేషనల్ వైదిక్ అకాడమీ(Asia International Vedic Academy) ఆధ్వర్యంలో సామాజిక సేవ అనే అంశంపై ఏపీవో రజియా నిర్వహించిన పరిశోధనకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాదు నుండి గౌరవ డాక్టరేట్ ఇటీవల అందుకుంది.
ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వర్ తో పాటు వివిధ శాఖల అధికారులు డాక్టరేట్ గ్రహీతను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, ఏపిఎం లలిత, ఈజీఎస్ ఈసి మధు టిఎ రాజమల్లు, కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈద లింగయ్య సత్యనారాయణ రాజేందర్ మాజీ సర్పంచ్ ఓడ్నాల కొమురయ్య, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్, బిఆర్ఎస్ నాయకులు ఫిరోజ్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.