03-06-2025 10:52:52 PM
జెఈఈ అడ్వాన్స్ లో సీటు సాధించిన ఎల్ మనోజ్ కి ఘన సన్మానం..
మణుగూరు (విజయక్రాంతి): మణుగూరులోని బాంబే కాలనీ ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో చదివినటువంటి ఎల్ మనోజ్ జెఈఈ అడ్వాన్స్(JEE Advance)లో ఆల్ ఇండియా 768 ర్యాంకు సాధించాడు. మంగళవారం ఎక్స్ లెంట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మనోజ్ కు వారి పాఠశాలలో యాజమాన్యం తరఫున ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎండి యూసఫ్ మాట్లాడుతూ... మా పాఠశాలలో చదివిన మనోజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నామని ఈరోజు పాఠశాల ఖ్యాతిని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిలబెడుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
డైరెక్టర్ ఖాదర్ యాకూబ్ షరీఫ్ మాట్లాడుతూ... ప్రతి విద్యార్థిని వారి జీవితంలో గొప్ప స్థాయిలో ఎదగటానికి మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటామని విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యమని అన్నారు. జానీ మియా ఖాన్ మా పాఠశాల నుండి చాలా మంది విద్యార్థులు ప్రత్యేక గుర్తింపు పొందిన కంపెనీలలో ప్రభుత్వ ఉద్యోగాలలో వివిధ రాష్ట్రాలలో స్థిరపడటం అలాగునే ప్రస్తుతం మనోజ్ కూడా అదే స్థాయిలో ఉద్యోగం సంపాదించి నిలబడాలని తనని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నామని అన్నారు.
భాను మాట్లాడుతూ ప్రత్యేకించి తల్లిదండ్రుల యొక్క మాట వినడం గురువుని పూజించటం అనేవి తెలుసుకున్న ఏ విద్యార్థి అయినా గొప్ప స్థాయిలో నిలబడటానికి నిలబడతాడని చెప్పుకోవటానికి ఇది ఆదర్శమని ఈ సందర్భంగా ఆ విద్యార్థికి పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.