03-06-2025 10:50:15 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలోని వైకుంఠాపూర్, కంకేట గ్రామాలలో ఎమ్మార్వో శ్రీదేవి, ఉప తాహ్సిల్దార్ రవీందర్ తో కలిసి మంగళవారం భూ భారతి రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భూ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. భూ సంబంధిత పత్రాలు పట్టా పస్ బుక్కులో గాని ఇతర వాటిలో గాని ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి వివరించారు. భూ సంబంధిత పత్రాల్లో పొరపాట్లు ఉన్న రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రాకేష్, స్వప్న, సుమన్ , యోహాను తదితరులు పాల్గొన్నారు.