03-06-2025 10:57:03 PM
మరో వ్యక్తికి గాయాలు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం పెగడపల్లి పత్తి జిన్నింగ్ మిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్(SI Kiran Kumar) తెలిపిన వివరణ ప్రకారం.. ఈ సంఘటనలో భూక్య సురేష్ ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బెల్లంపల్లి నుండి ఆసిఫాబాద్ కు వెళ్తున్న ట్రాక్టర్ వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రక్కన ఉన్న రాజుకి గాయాలు అయ్యాయి. చికిత్స కోసం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సురేష్ సోమగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. కాగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుందన్నారు.