calender_icon.png 29 June, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరియువతకు మార్గదర్శకుడు!

29-06-2025 12:57:32 AM

  1. తనదైన మార్క్‌తో భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సత్ఫలితాలు
  2. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదలకు ‘ఉద్దీపకం వర్క్‌బుక్కులు’
  3. ఐటీడీఏ ప్రాంగణంలో రూ.50 లక్షలతో మ్యూజియం ఆధునీకరణ

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 28 (విజయక్రాంతి): భద్రాచలం ఐటీడీఏ పీవోగా ఏడా ది కాలంలోనే అద్భుతాలు సృష్టించారు యువ ఐఏఎస్ ఆఫీసర్ బీ రాహుల్. 2024 జూన్ 25న బాధ్యతలు చేపట్టిన ఆయన పక్కా ప్రణాళికలతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధించారు. గిరిజన ప్రగతి విద్యతో నే సాధ్యమవుతుందని విశ్వసించిన ఐఏఎస్ రాహుల్ తన ఏడాది పాలనలో విద్యపైనే ప్రధాన దృష్టి సాధించారు. విద్యాభివృద్ధికి కంకణబద్ధులై అనేక విప్లవాత్మక విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు.

ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, ప్రీ మెట్రిక్ హాస్టల్స్, జీపీఎస్ పాఠశాలలో ఇలా దాదాపు 348 విద్యాసంస్థల్లో చదువుతున్న దాదాపు 30,854 మం ది బాలబాలికల విద్యాప్రగతికి తోడ్పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా లో 32 గిరిజన గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న దాదాపు 12,897 మంది విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. 

గిరిబిడ్డలకు ఉద్దీపకం.. 

ప్రాథమిక దశలో సరైన పునాది పడితే అది ప్రగతికి దోహదపడుతుందని నమ్మిన ఐటీడీఏ పీవో రాహుల్ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థుల నైపుణ్యం పెంపుదలకు ఉద్దీపకం వర్క్ బుక్కులను అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలకు కష్టంగా ఉండే గణితం, ఆంగ్లం తదితర సబ్జెక్టులలో నిష్ణాతుల చేత వర్క్‌బుక్కులను తయారు చేయిం చి గిరిబిడ్డలకు పటిష్టమైన విద్య అందిస్తున్నారు. పీవో చర్యలతో నేడు గిరిపిల్లలు వేదిక్ మాథ్స్, ఆంగ్ల భాష నైపుణ్యాన్ని పెం పొందించుకుంటున్నారు.

2024- విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రతీ పాఠశాలకు ప్రత్యేక అధికారులను నియమించ డంతో ఈ ఏడాది దాదాపు 26 స్కూల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించటం గమనార్హం. టెన్త్ బాలబాలికలకు స్పెషల్ మెనూ, గ్రాఫ్, మ్యా ప్ పాయింటింగ్, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, మెటల్ స్కేళ్లు, ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్ తదితర అత్యవసరాలను అం దించి ప్రోత్సహించారు.

గిరిజన పిల్లలు చదువులోనే కాకుండా ఆటపాటల్లో రాణించేలా పీవో రాహుల్ తనదైన శైలిలో చర్యలు తీసుకున్నారు. ఉట్నూర్‌లో 2024 సంవత్సరంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీల్లో భద్రాచలం ఐటీడీఏ జోన్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించటం గమనార్హం.

గిరిజన సంక్షేమమే ధ్యేయం..

మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసముంటున్న గిరిజనుల  సంక్షేమానికి ము ఖ్యంగా ఆరోగ్య పరిరక్షణకు ఐటీడీఏ పీవో రాహుల్ ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రితో పాటు ఏజెన్సీ లోని అన్ని పీహెచ్‌సీల్లో మందులు, వ్యాక్సి న్లు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా కృషి చేశారు. గిరిజన మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు నడిపించుకోవడానికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించి మార్కెటిం గ్ సౌకర్యం చేసుకోవడానికి అవకాశాలను కల్పించారు. 

ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు ఘనత

అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుటకు భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో రూ.50 లక్షలతో మ్యూజియం ఆధునీకరణ పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో పీవో రాహుల్ సఫలీకృతులయ్యారు. గవర్న ర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా ప్రారంభించి మ్యూజియం అభివృద్ధికి రూ.కోటి మంజూరుకు కృషి చేశారు.  నిత్యం వేలాదిమంది వివిధ ప్రాం తాల నుంచి యాత్రికులు ట్రైబల్ మ్యూ జియం సందర్శిస్తున్నారు.

గిరిజనుల కోయ భాష అంతరించిపోకుండా నేటితరం గిరిజన యువతకు తెలియజేయడానికి ఆహ్వాన పత్రాలు, కోయ భాష తెలుగు లిపితో ము ద్రించి వాటి పరిరక్షణకు కృషి చేశారు. పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో బెల్లంపల్లి రిటర్నింగ్ అధికారిగా ఉత్తమ సేవలందించినందుకు గాను గవర్నర్ చేతులు మీదుగా ఉత్తమ రిటర్నింగ్ అధికారిగా అవార్డు అందుకున్నారు.

ఉపాధి అవకాశాల కల్పన.. 

గిరిబిడ్డలకు విద్యావకాశాలకు పెద్దపీట వేయటమే కాకుండా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోసం పీవో రాహుల్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు సంపాదించి జీవనోపాధి పెంపొందించుకో వ డానికి గిరిజన యువతకు వివిధ ఉద్యో గ, ఉపాధి కోర్సులలో శిక్షణ అందించి వారి కి తోడ్పడుతున్నారు. బీటీపీఎస్, ఐటీసీ, జెన్కో ప్రతినిధులతో మాట్లాడి గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేశారు. డీఎస్సీ, నీట్, పోలీస్, ఎస్‌ఐ వివిధ గ్రూప్ పరీక్షల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రత్యేక నిష్ణాతులచే కోచింగ్ ఇప్పిస్తున్నారు.

భద్రాచలం పట్టణంలో గ్రంథాలయానికి రూ.25 లక్షల  ఖర్చుతో రీడింగ్ రూమ్ నిర్మాణం చేపట్టారు. గిరిజన యువత శిక్షణ కేంద్రం లో కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ కోర్సులో 35 మంది యువతకు ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించారు. ఐ టీసీ ప్రథం ద్వారా భద్రాచలం లో పిటిష న్ కోర్సులో 87 మందికి, బూర్గంపహాడ్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ 169 మంది యువతకు ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించారు. స్వయం ఉపాధి శిక్షణలో 654 మంది యువతకు నాక్, ఆర్‌సీటీ ఖమ్మం ద్వారా శిక్షణ ఇప్పించారు.