భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత..
285 క్వింటాళ్ల బియ్యం సీజ్
భద్రాచలం (విజయక్రాంతి): పేద ప్రజల బియ్యం పక్క దారి పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. రూ.10 లక్షల విలువగల సుమారు 285 క్వింటాళ్ల రేషన్ బియ్యం, పెద్ద మొత్తంలో సివిల్ సప్లై అధికారులు అక్రమ రవాణా చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేసారు. వివరాల్లోకి వెళితే సోమవారం తెల్లవారుజామున సివిల్ సప్లై అధికారులు గోదావరి బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళుతున్న ఛత్తీస్ ఘడ్ లారీని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ లారీ ఆపకుండా పారిపోతున్న సమయంలో వెంబడించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో లారీని అడ్డుకుని ప్రశ్నించగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుసుకుని, రేషన్ బియ్యాన్ని జిసిసి గోడౌన్ కు తరలించి కేసు నమోదు చేసి లారీనీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేషన్ బియ్యం విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని డిటి శ్రీనివాస్ తెలిపారు.






