2 May, 2026 | 9:23 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

జాతీయ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి

25-05-2025 01:08 AM

కిషన్‌రెడ్డికి ఈబీసీ అధ్యక్షుడి వినతిపత్రం  

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి):  తెలంగాణ రాష్ర్టంతో పాటు కేంద్రంలో జాతీయ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఈబీసీ జాతీయ అధ్యక్షులు, అగ్రకులాల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రవీందర్ రెడ్డి దిల్ కుష్ అతిథి గృహంలో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈబీసీల అభి వృద్ధికి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, అలాగే ఈబీసీ ఫైనాన్స్ కార్పెరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సం క్షేమానికి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అగ్రవ ర్ణాలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.