25-05-2025 01:05:31 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ర్ట బీసీ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్ (ఆర్జేసీ) మొదటి సంవత్సరం అడ్మిషన్లకు ఫలితాలు శనివారం విడుదలయ్యా యి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో చూసుకోవాలని గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. ఈ ఏడాది నుం చి ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా 10వ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
మొత్తం 130 బాలుర కాలేజీల్లో 11,3 60 సీట్లు.. 127 బాలికల కాలేజీల్లో 10,720 సీట్లు కలిపి మొత్తం 22,0 80 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.ఆన్లైన్ ద్వారా 61,119 మం ది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 22,080 మంది విద్యార్థు లు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు సంబంధిత డాక్యుమెంట్లతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్ తీసుకోవాలని సూచించారు.