25-05-2025 01:10:11 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రముఖ విద్యాసంస్థ అయిన గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీపై పలువురు ఫ్యాకల్టీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్ ద్వారా ఎన్బీఏ, యూజీసీ, తెలంగాణ ఉన్న త విద్యామండలి, జేఎన్టీయూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలేజీల తనిఖీల్లో భాగంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాలేజీల్లో చేపట్టిన తనిఖీలు సరిగా చేయలేదని ఆరోపించారు.
తనిఖీలప్పుడు కళాశాలలో మొత్తం అధ్యాపకుల సంఖ్య, వారి బయోమెట్రిక్ హాజరును ధ్రు వీకరించారా? అని నిలదీశారు. లేని ఫ్యాకల్టీలను ఉన్నట్లుగా సృష్టించి మోసం చేశారన్నారు. ల్యాబ్లను సరిగా తనిఖీలు చేశారా?
అందులో చాలా వరకు పరికరాలు పనిచేయ డం లేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధ్యాపకుల జీతాల స్టేట్ మెంట్లు, ఇంక్రిమెంట్లను సరిపోల్చారా? అంటూ అధికారులకు పలు ప్రశ్నలతో కూడిన ఓ లేఖను గోకరాజు రంగరాజు కాలేజీ ఉద్యోగులు పంపించారు.