calender_icon.png 12 October, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం దిగుబడిలో అరుదైన రికార్డు

12-10-2025 03:47:51 AM

  1.   148.3 లక్షల టన్నుల ఉత్పత్తి
  2. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం
  3. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం అరుదైన రికార్డు నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతాంగ అనుకూల విధానాలతోనే ఇది సాధ్యపడిందని తెలిపారు.

దేశ చరిత్రలోనే ధాన్యం దిగుబడిలో అత్యధికంగా 148.3 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించిన రా ష్ట్రంగా తెలంగాణా నిలబడిందని, తాము అధికారంలోకి వచ్చాక సాగు అయిన మూడు పంటలలో ఒక పంట మరో పంటతో పోటీ పడుతూ మూడు పంటలలోను ధాన్యం దిగుబడిలో రికార్డు సృష్టించిందన్నారు. ఈ వానా కాలంలో 148.3 లక్షల దిగుబడి అందుకు తార్కాణమన్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆయన చెప్పారు.22 వేల నుంచి 23 వేల కోట్ల వ్యయంతో ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు.

దిగుబడి అయిన మొత్తం లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించిందని, అందు లో 40 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు, 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డు రకాలు ఉన్నాయన్నారు . ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. అందులో కామారెడ్డి, నిజమాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొం డ జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే 1,205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు..ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పై 16న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోళ్ల పై ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులకు పంపించామన్నారు. అక్టోబరు 1న ప్రారంభంఅయిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి య జనవరి రెండో వారంలో పూర్తి అవుతాయన్నారు.  కలెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కుం భం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామ్యో ల్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీం ద్ర, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, గ్రం థాలయం చైర్మన్ అవేజ్ చిస్తీ, జడ్పీ సీఈఓ శోభా రాణి, ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా ఇరిగేషన్ ఎస్ ఈ రవీందర్,జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి నాగిరెడ్డి, పౌర సరఫరా మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు.