26 May, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

టిప్పు సుల్తాన్ కాలం నాటి విప్లవ వీరుడు

10-02-2026 12:00 AM

భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్ర తెరపైకి రానుంది. ‘విప్లవ వీరుడు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తుండగా.. జైశ్వర్-, సోనాలి జంటగా నటిస్తున్నారు. ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కథానాయకుడు జైశ్వర్ మాట్లాడుతూ.. “ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా చరిత్రలో నిలిచిపోతుంది” అని చెప్పారు. ‘ఇది నా మొదటి సినిమా. అందరి ఆశీర్వా దం కావాలి’ అని కథానాయకి సోనాలి అన్నారు. దర్శకుడు నాగరాజు రావు మాట్లాడుతూ.. “ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. బ్రిటిష్ కాలం నాటి హిస్టారికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం” అని తెలిపారు.

నిర్మాత ఏవీ జయ రాం మాట్లా డుతూ.. “టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. మంచి సందేశం ఇచ్చే సినిమా అవుతుంది” అని చెప్పారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ.. “స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించబోతున్నా. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే కథాంశం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటుడు పటేల్ అశోక్‌రెడ్డి తదితర చిత్రబృందం పాల్గొన్నారు.