calender_icon.png 19 June, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ టీచర్.. బడిని బాగు చేశాడు

18-06-2025 10:24:39 PM

10 ఏళ్లకు తెరుచుకున్న పాఠశాల..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) హజారియా తండా ప్రాథమిక పాఠశాల 10 ఏళ్ల క్రితం మూతపడింది. ఈ పాఠశాల పక్కనే ఉన్న ఎర్రబోడు తండా పాఠశాలకు హెడ్మాస్టర్ గా బదిలీపై వెళ్లిన భూక్యా రమేష్ తాను పనిచేసే చోట పాఠశాల భవనం లేకపోవడం, పిల్లలు కూడా ఎక్కువ మంది లేకపోవడంతో తమ పాఠశాలకు చెంతనే పక్కా భవనం ఉండి పిల్లలు బడికి రాకపోవడంతో మూతపడ్డ పాఠశాలను తెరిపించాలని నిర్ణయించాడు. ఈ మేరకు తన సొంత డబ్బు 30 వేల రూపాయలు వెచ్చించి హజారియా పాఠశాల భవనానికి రంగులు వేయించి ముస్తాబు చేశాడు.

దీనితో ఎర్రబోడు తండా, హజారియా తండాలో బడి ఈడు గల 23 మంది పిల్లలు పాఠశాలకు వచ్చేందుకు సన్నద్ధత తెలిపారు. దీనితో బుధవారం పాఠశాల ప్రారంభ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పాఠశాలకు తమ పిల్లలను తల్లిదండ్రులు స్వయంగా తోడుకొని వచ్చి చేర్పించారు. జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ మందుల శ్రీరాములు, సీఎమ్ఓ చంద్రశేఖర్ ఆజాద్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రారంభ వేడుకకు హాజరై ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయుడు గుడ్ల శీను సమిష్టిగా పాఠశాలను తిరిగి తెరిపించడానికి చేసిన కృషిని అభినందించారు.