20 March, 2026 | 8:41 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ప్రత్యేక ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలి..

09-02-2025 05:58 PM

ఉత్తర తెలంగాణ అభివృద్ధి ఫోరం ఛైర్మన్  డాక్టర్ కేశవులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ సమగ్రాభివృద్ధికీ ప్రభుత్వాలు సహకరించాలి, అందుకు గాను ప్రత్యేక ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలని ఉత్తర తెలంగాణ అభివృద్ధి ఫోరం ఛైర్మన్ డాక్టర్ కేశవులు అన్నారు. రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న అధ్యక్షతన ఆదిలాబాద్ లో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఫోరం ఛైర్మన్ డాక్టర్ కేశవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు మాట్లాడుతూ... ఉత్తర తెలంగాణలోని  ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జిల్లాల్లో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. అడవులు, ఖనిజసంపద, పంట భూములకు కొదువ లేదని, సాగు, తాగునీరు కల్పించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుందని, రవాణా లేని ప్రాంతాలు ఏనాడూ అభివృద్ధి కావని గుర్తు చేశారు.