09-02-2025 06:01:32 PM
ఆహ్వానం అందించిన ఉత్సవ కమిటీ సభ్యులు..
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో ఫిబ్రవరి 14న నిర్వహించే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కి ఉత్సవాలకు రావాలని ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానపత్రం అందజేసారు. ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బద్య నాయక్, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.