శ్రీ రామలింగేశ్వర స్వామివారికి వెండి కానుక
27-02-2026 12:00 AM
వెంకటాపూర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్పలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఘనపూర్ గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధరచారి చంద్రిక దంపతులు (లలిత జ్యూవెలర్స్) తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 371 గ్రాముల బరువున్న వెండి శివలింగాన్ని కానుకగా అందజేశారు. దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీర్వాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.




