14 July, 2026 | 7:18 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

20-01-2026 12:47 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాఠశాల గేటు ముందు ఉన్న ఓ విద్యుత్తు స్తంభాన్ని ప్రమాదవశాత్తు తాకడంతో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రకల్ గ్రామానికి చెందిన మల్లేష్, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

9వ తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు లోకేష్ (14) రోజులాగే పాఠశాలకు చేరుకుని పాఠశాలలో ఆటల పోటీలు ఉన్నాయని బయట ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం వద్ద ఉన్న విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే కుప్పకులాడు. అది గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులను పిలిపించి విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు గ్రామస్తులు ఆరోపించారు.