calender_icon.png 20 January, 2026 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి

20-01-2026 12:44:15 PM

సర్పంచ్ రాముడు నాయక్ 

మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని భీల్యానాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోతు రాముడు నాయక్ విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని, పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని కోరారు. ఈ పత్రికలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో రిపోర్టర్ బానోతు పాండు నాయక్,సుశీల, రవీందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.