calender_icon.png 20 September, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు జాబితా సరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

19-09-2025 10:30:03 PM

రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఓటరు జాబితా సరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు- కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి మాట్లాడుతూ 2002, 2025 ఓటరు జాబితాలను సరి పోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల అధికారి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు, శాసనసభ నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ చేపట్టాలని, 2002, 2025 ఓటర్ జాబితాను సరి పోల్చేందుకు ఎబీసీడీ విభాగాలుగా విభజించాలని తెలిపారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈనెల 23వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేసి, ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ఎన్నికల అధికారికి నిర్ణీత నమూనాలో నివేదిక సమర్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజాగ్లో ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు. 

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజసవ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.

2002, 2025 ఓటరు జాబితాలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 4 కేటగిరీలుగా విభజించి వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 24వ తేదీన సమర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్ల ఖాళీలను భర్తీ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.