27 May, 2026 | 10:22 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

08-11-2024 04:15 PM

మంథని (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామపంచాయతీలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన చుంచు రమేష్ అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చుంచు రమేష్ తన ద్విచక్ర వాహనంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గుంపుల మానేరు వంతెన దాటుతుండగా వావిలాల ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న వ్యానును ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.