21-06-2025 02:24:32 PM
హైదరాబాద్: ఎన్ఓసీ వచ్చాక నీరు వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెబితే.. హరీశ్ రావు తప్పుపడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. నీటి విషయంలో సమస్య పరిష్కారం అవుతుందనే భయంతో హరీశ్ రావు ఉన్నారని తెలిపారు. సమస్య పరిష్కారం అయితే మాట్లాడడానికి మరో అంశం ఉండదనే అభద్రత భావంతో ఉన్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), హరీశ్ రావు చిల్లర పంచాయితీలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్, హరీశ్ రావు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు చర్యల వల్ల తెలంగాణ నష్టపోయిందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలన నుంచే తెలంగాణకు నష్టం జరుగుతోందని విమర్శించారు. రైతులను డైవర్ట్ చేయడానికి బనకచర్ల అంశాన్ని(Banakacherla topic) ముందుకు తెచ్చారని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.