10 March, 2026 | 12:43 PM

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

09-07-2024 05:04 PM

జనగామ : అవినీతి నిరోధక శాఖ వలకి మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ చిక్కడు. జనగామ జిల్లా రాఘునాథపపల్లి మండలం కంచెనపల్లి పంచాయతీ కార్యదర్శి శివాజీ ఓ వ్యక్తిని కేసు నీరు కార్చేందుకు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధాకారులను ఆశ్రవించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాధితుని వద్ద  కార్యదర్శి శివాజీ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.