17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఏసీబీకి చిక్కిన ఏవో, కాంట్రాక్టు ఉద్యోగి

27-06-2025 01:22 AM

ఆదిలాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులతో అవినీతి అధికారుల బాగోతం బట్టబయలు అవుతున్నాయి. ఇప్పటికే పలువురు అవినీతి అధికారులు ఏసీబీ కి చిక్కగా, తాజాగా ఆదిలాబాద్ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, కాంట్రాక్టు ఉద్యోగి పట్టుబడ్డారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్యాల యంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో కాం ట్రాక్టర్ సంతోష్ వద్ద నుంచి మున్సిపల్ అకౌంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏవో) బట్టల రాజ్ కుమార్ గౌడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ కొండ్ర రవికుమార్ ద్వారా రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.కాంట్రాక్టర్ చేసిన పనులబిల్లుల కోసం రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దింతో రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఐతే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దింతో బాధితుడు రూ.15 వేలు కంప్యూటర్ ఆపరేటర్ సహకారం ద్వారా మున్సిపల్ అకౌంట్ సెక్ష న్ కార్యాలయంలో మున్సిపల్ ఏవోకు లం చం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపారు.