calender_icon.png 27 June, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్‌పై ఈగిల్ కన్ను!

27-06-2025 01:23:46 AM

  1. విక్రేతలపై ఉక్కుపాదం.. 
  2. డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు 
  3. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుకుందాం.. 
  4. స్కూళ్లలో డ్రగ్స్ పట్టుబడినా, వినియోగించినా యాజమాన్యాలదే బాధ్యత 
  5. ‘యాంటీ డ్రగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే’లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్రప్రభుత్వం ఈగిల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) వ్యవస్థను ఏర్పాటు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆకాశం వెళ్తున్న గద్ద ఎలాగైతే తన టార్గెట్‌ను గుర్తించి, దాడి చేస్తుందో ‘ఈగిల్’ కూడా అలాగే డ్రగ్స్ విక్రయ, వినియోదారులుపై ఉక్కుపాదం మోపతుందన్నారు.

అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే సందర్భగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గురువారం  హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అవగాహన సదస్సు జరిగింది. తొలుత ముఖ్యమంత్రి ‘ఈగిల్’కు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు.  అనంతరం సీ ఎం మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ జో లికి వెళ్లకుండా విద్యాసంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సీఎం సూ చించారు.

ఒకవేళ విద్యాసంస్థల్లో డ్రగ్స్ పట్టుడితే.. యాజమాన్యాలదే పూర్తి బాధ్య త అని తేల్చిచెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల మాగాణి ఉందని, వాటిలో ఎక్కడ గంజాయి మొక్కలు నాటినా నిమిషాల్లో ఈగిల్‌కు సమాచారం చేరుకుం టుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎవరు డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

డ్రగ్స్ విక్రయాల కారణంగా పంజాబ్ యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకున్నార ని, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుం డా ఉండాలనేదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు యువత డ్రగ్స్‌కు బానిస అవుతున్నారనే వార్తలు తమను బాధకు గు రిచేస్తున్నాయని వాపోయారు. తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. 

హైదరాబాద్‌ను న్యూయార్క్‌లా చేస్తాం..

డ్రగ్స్ కట్టడికి కేవలం ప్రభుత్వమో, పోలీసులో పనిచేస్తే చాలదని, డ్రగ్స్‌ను తరమి కొట్టే యజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరా బాద్‌ను బెంగళూరు, ముంబై, ఢిల్లీ తరహాలోనే కాదు.. న్యూయార్క్ స్థాయిలో అభి వృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర జనా భాలో 68శాతం మంది యువతనేనని, ఆ యువ బలమే రాష్ట్ర చోదకశక్తి అని కొనియాడారు.

యువతలో నైపుణ్యాలను మెరు గుపరిచేందుకే సర్కార్ స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నదని స్పష్టం చేశారు. అలాగే యువత క్రీడలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. క్రీడలతో మా నసిక ఉల్లాసం, శారీరకదారుఢ్యం సాధ్యమన్నారు. సినీస్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలను స్కూల్‌కు పంపాలంటే భయపడే పరిస్థితులు ఉండకూడదని, ప్రతిఒక్కరూ ఒక సైనికుడిగా మారి డ్రగ్స్ నిర్మూలనకు పోరాడాలని పిలుపునిచ్చారు.

స్కూల్ పిల్లలు డ్రగ్స్‌కు బానిస అవుతున్నట్లు తాను చూస్తున్నానని, ఆ వార్తలు తనను ఎంతగానో బాధిస్తున్నాయని తెలిపారు. తాను ఒక తండ్రినే అని, తల్లిదండ్రులు డ్రగ్స్ మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో సినీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘యువతీ యువకుల్లారా.. ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. మన తల్లిదండ్రులను సంతోషపెట్టడం కంటే గొప్ప విజయమేదీ లేదు. 

మీరు డ్రగ్స్ బారి న పడితే అమ్మానాన్న కుమిలిపోతారు. ద యచేసి డ్రగ్స్‌కు దూరంగా ఉండండి’ అని విజ్ఞప్తి చేశారు. సినీ నిర్మాత దిల్ రాజు మా ట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మలయాళ చిత్ర పరిశ్రమ తరహాలో డ్రగ్స్ తీసుకున్న వారిని, చిత్రపరిశ్రమ నుంచి బహిష్కరించే విధానం పై ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,  బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి 

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మా ట్లాడుతూ.. విద్యార్థులందరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్నేహితులకు డ్రగ్స్ అలవాటు ఉంటే, వారిని ఆ వ్యసనం నుంచి బయటకు తీసుకురావాలని సూచించారు. క్రీడలపై యువత దృష్టి సారించాలన్నారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు కేం ద్ర, రాష్ట్రప్రభుత్వాలు భారీగా నిధు లు కేటాయిస్తున్నాయన్నారు. ఈగల్, పోలీసు, నిఘా వ్యవస్థలు డ్రగ్స్ విక్రేతల పనిపట్టి, యువతను డ్రగ్స్ మహమ్మారికి చిక్కకుండా చూడాలని సూచించారు. 

తస్మాత్ జాగ్రత్త!

  1. నేటి నుంచి ఈగిల్ పని మొదలుపెడుతోంది 
  2. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పోస్ట్ 

‘తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా.. డ్రగ్స్ రాష్ట్రంలోకి ప్రవేశించినా.. ఇకపై ఈగిల్ నిశితంగా గమనిస్తుంది.. తస్మాత్ జాగ్రత్త’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రం కోసం నేటి నుంచి పని మొదలు పెడుతోందంటూ  సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడ పడుతాయని, గంజాయిని గమనించినా, డ్రగ్స్ ఆనవాళ్లను పరిశీలించినా క్షణంలో పట్టేస్తాయని సీఎం తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రజాప్రభుత్వంతో ప్రతిఒక్కరు కలిసి నడవాలని కోరుతున్నట్టు సీఎం పేర్కొన్నారు.