17-10-2025 01:13:19 AM
నల్గొండ క్రైమ్, అక్టోబర్ 16: 8వేల లంచం తీసుకుంటూ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్; ఎ. సత్యనారాయణ రెడ్డి గురువారంఏసీబీకి రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాట చేయడానికి షాపు నిర్వాహకుడు ఎన్ ఓ సి అడిగారు. ఎన్ ఓ సి ఇచ్చేందుకు 10వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏ సి బి అధికారులకు ఫిర్యాదు చేశాడు.
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డికి రూ.8వేలకు లంచం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని ఎన్జీ కాలేజీలో కలిసి మాట్లాడిన తర్వాత బైక్ ట్యాంక్ కవర్లో 8వేలు పెట్టాడు ఏ సి బి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు జిల్లా ఫైర్ అధికారి సందేశ్ కుమార్ కి సమాచారం ఇచ్చారు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని, నివాసంలో సోదాలు నిర్వహిస్తామని ఏసిబి డిఎస్పి జగదీష్ చందన్ తెలిపారు అధికారులు ఎవరైనా తన విధులు నిర్వహించ కుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, ట్విట్టర్,ఫేస్బుక్ నేరుగా ఫిర్యాదు చేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.