calender_icon.png 2 July, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్...

01-07-2025 11:09:44 PM

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) కందుకూర్ డివిజన్ తలకొండపల్లి మండల తహసీల్దార్ నాగార్జున(Tahsildar Nagarjuna) రైతు నుండి మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు కుటుంబ సభ్యులకు తమ పూర్వీకుల నుండి వ్యవసాయ పొలం సంక్రమించింది. ఆ పొలాన్ని తమ నలుగురు సోదరుల పేరు విరాసత్ చేయాలని మండల తహసీల్దార్ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకున్నారు. విరాసత్ చేయాడానికి తహసీల్దార్ నాగార్జున కొంత మొత్తం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయాన్ని రైతు మల్లయ్య ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెల్లారు. 

ఏసీబీ అధికారుల సూచన మేరకు రైతు మల్లయ్య మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళారు. పొలం విరాసత్ చేసేందుకు ఆఫీసులో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న యాదగిరి కి రూ.10 వేలు లంచం డబ్బులు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ఏ-1గా తహసిల్దార్ నాగార్జున, ఏ-2 గా అటెండర్ యాదగిరి లను అరెస్ట్ చేసి జుడిసియల్ రిమాండుకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిబి అధికారులు అధికారిక పత్రాన్ని రిలీజ్ చేశారు. సంవత్సర కాలంగా మండల తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న నాగార్జున కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు నిర్నయించి రైతుల వద్ద నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవాడని పలువురు  రైతులు ఆరోపించారు. ఏసీబీ అధికారుల కు తాసిల్దార్ పట్టుబడిన విషయం మండలంలో దావనంలా వ్యాపించడంతో పలువురు రైతులు స్పందించారు. తమ ఉసురు తగిలి ఏసిబి అధికారులకు పాపం పండి పట్టుబడ్డాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.