11-11-2025 10:59:37 PM
రూ. 50 నేను లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై, ఏఆర్ కానిస్టేబుల్..
గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 50వేల లంచం తీసుకుంటుండగా నులుగు ఎస్సై విజయ్ కుమార్ ను పట్టుకున్నారు. ములుగు మండల పరిధిలోని క్షీరసాగర్ గ్రామంలో భూ వివాదం విషయంలో ఎస్సై ఓ వర్గం నుండి ఎస్సై విజయ్ కుమార్ రూ. 50వేల లంచం డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుందగా ములుగు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఎస్సైని పట్టుకున్నారు. ఎస్ఐతో పాటు ఎఆర్ కానిస్టేబుల్ రాజు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తున్నారు.