27-06-2025 12:18:37 AM
భీమదేవరపల్లి, మే 26 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమ దేవరపల్లి మండల రిజిస్ట్రేషన్ అధికారులు లంచాలు తీసుకున్నట్టు ఫిర్యాదులు రావడంతో భీమదేవరపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీ బీ అధికారులు గురువారం దాడులు నిర్వహించినట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. డీజీ ఉత్తర్వుల మేరకు ఆకస్మిక తనిఖీలు చే యగా భీమదేవరపల్లి రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వా రా అదనంగా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు.
ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్లు నలుగురు నుంచి రూ.96,870 నగదు స్వా ధీనం చేసుకున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి డాక్యుమెం టు రైటర్లు లోపలికి అనుమతించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ వారు స్వేచ్ఛగా వెళ్తున్నారని అన్నారు. ఒక రైటర్ వద్ద పాత కాలపు డాక్యుమెం ట్లు దొరికాయని, వాటిని సీజ్ చేసినట్టు తెలిపారు.