27-06-2025 12:18:21 AM
పటాన్ చెరు, జూన్ 26 : జిన్నారం మండలంలోని బొల్లారం, గడ్డపోతారం మున్సిపాలిటీ నూతన కమిషనర్లుగా బీ.కిషన్, ఈ.వెంకట్రామయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. కిషన్ పదోన్నతిపై బొల్లారం మున్సిపల్ కమిషనర్ గా నియమితులయ్యారు. గడ్డపోతారం కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంకట్రామయ్య ఇంతకు ముందు తెల్లాపూర్ రెవెన్యూ ఆఫీసర్ గా పని చేసి పదోన్నతిపై కమిషనర్ గా వచ్చారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది కమిషనర్లుగా బాధ్యతలు స్వకీరించిన బీ. కిషన్, వెంకట్రామయ్యలకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతంపలికారు