11-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 10(విజయక్రాంతి): తెలంగాణ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యుత్ ఉద్యోగుల కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం వారికి రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో బుధవారం ఈ మేరకు సర్కార్ తరఫున ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఒప్పందం ద్వారా 51,868 మంది విద్యుత్తు ఉద్యోగులకు బీమా భరోసా ఉంటుందని, ఈ ఒప్పందం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. విద్యుత్ ఉద్యోగు లు ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రా ణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తారని, వారి కుటుంబాల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని లైన్మెన్ నుంచి సీఎండీ వరకు అందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
ఎస్బీఐ లో ఖాతా తెరిచిన ప్రతి విద్యుత్శాఖ ఉద్యోగికి ఒక్క ప్రమాద బీమానే కాకుండా, శుభాకార్యాలు, పిల్లల చదువులకు ఆర్థికసాయం, రుణాలు అందించే వి ధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగి సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల పరిహారం, శాశ్వత వైకల్యం పొందితే ఉద్యోగికి రూ.80 లక్షల పరిహారం అందిస్తామన్నారు. ఉద్యోగి సహా కుటుంబ సభ్యులకు కలిపి రూ.20 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సం దీప్కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు.