calender_icon.png 12 June, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగు పడి మహిళ మృతి..

10-06-2025 11:37:21 PM

భీంపూర్ (విజయక్రాంతి): తన అత్తమ్మ మృతి చెందడంతో ఆమె కర్మకాండలకు హాజరయ్యేందుకు వెళ్లిన ఓ మహిళ పిడుగుపాటుకు గురై మృతిచెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) భీంపూర్ మండలంలో చోటుచేసుకుంది. నిపాని గ్రామానికి చెందిన కలిమి నాగమ్మ(48) పిడుగుపాటుతో మృతి చెందారు. తన అత్తమ్మ ఇటీవల చనిపోవడంతో మంగళవారం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్వహించిన కర్మకాండల్లో పాల్గొనేందుకు నాగమ్మ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి వెళ్ళింది. కార్యక్రమం ముగిసిన తర్వాత తమ గ్రామానికి తిరిగి వెళ్లే క్రమంలో అందరూ బస్టాండ్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దింతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది.