11-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 10 (విజయకాంతి): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సేవాదళ్ రాష్ట్ర నాయకులు ఎంబడి రాజేశ్వ ర్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వర్ 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ సేవాదళ్ విభాగం లో అంకిత భావంతో పని చేయగా ఆయన సేవలో గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో నిర్మల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు